Friday 24 March 2017

మతిమరుపు

                                                                 మతిమరుపు మనుషులకు వస్తుందని తెలుసు కానీ విద్యుత్తుతో పని చేసే వస్తువులకు కూడా వస్తుందని సుచిత్రకు ఈమధ్యనే తెలిసింది.సుచిత్ర ఇంటిలో మైక్రో వేవ్ ఎన్ని ని.లు అమర్చి పెట్టినా ఒక ని.పని చేసి ఆగిపోవటం మొదలు పెట్టింది.మైక్రో వేవ్ రిపేరు చేసే అతన్ని పిలిస్తే మొత్తం తీసి చూచి అమ్మా దీనికి (మెమరీ  లాస్) మతిమరుపు వచ్చింది అని చెప్పాడు.సుచిత్ర మైక్రో వేవ్ కి మతిమరుపు రావటం ఏమిటి?విడ్డూరంగా అనేసరికి అవునమ్మా!దీనిలో ఒక పానెల్ ఉంటుంది.దానిలో ఒక భాగం పోయింది అందువల్ల అలా జరుగుతుంది.వందలో ఒకదానికి మాత్రమే ఇలా జరుగుతుంది.ఒకవేళ ఆ భాగం తెచ్చి వేసినా కూడా పనిచేస్తే   చెయ్యొచ్చు లేకపోతే లేదు.అని విపులంగా చెప్పాడు.సుచిత్ర అయ్యో రామచంద్రా!పాతిక వేలు పోసి నిన్న గాక మొన్న కోన్నానే అంటూ  తెగ బాధ పడి పోయింది  

No comments:

Post a Comment